రైళ్లలో ఆటోమేటిక్‌ డోర్‌ లాకింగ్‌ వ్యవస్థ | Automatic door locking system in Rajdhani, Shatabdi trains for passenger safety | Sakshi
Sakshi News home page

రైళ్లలో ఆటోమేటిక్‌ డోర్‌ లాకింగ్‌ వ్యవస్థ

Feb 13 2017 4:53 PM | Updated on Sep 5 2017 3:37 AM

రైలు ప్రయాణికుల భద్రత కోసం రైళ్ల తలుపులు వాటంతట అవే మూసుకుపోయే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు.

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల భద్రత కోసం రైళ్ల తలుపులు వాటంతట అవే మూసుకుపోయే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. ట్రైన్‌ గార్డులు.. వారి కేబిన్‌ నుంచే ఈ డోర్లను ఆపరేట్‌ చేసేలా వీటిని రూపొందిస్తున్నారు. ఫుట్‌బోర్డుల వద్ద నిలుచుని ప్రయాణికుల ఆభరణాలను లాక్కెళ్లటం, నడుస్తున్న రైల్లోంచి దిగే ప్రయత్నంలో పట్టాలపై పడటం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకే రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

తొలి ప్రయత్నంగా రెండు రాజధాని, రెండు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైళ్లలో తలుపులు తెరవడం, మూయడం మాన్యువల్ గా జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement