అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ, భారత్లో తన ఆఫీసులను తాత్కాలికంగా మూసివేసింది. బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై ఆఫీసులను మూసివేయడంతో పాటు, తమ ఈవెంట్లను పోస్ట్పోను చేస్తున్నట్టు వెల్లడించింది. స్వచ్ఛంద నిరసనకారులు తమపై దేశ ద్రోహ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు అమ్నెస్టీ నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో కశ్మీర్ అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేశారనే ఆరోపణలతో అమ్నెస్టీపై దేశ ద్రోహ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రోత్సహించారనే ఆరోపిస్తూ.. కొందరు రాజకీయ కార్యకర్తలు ఈ సంస్థ హక్కులపై వ్యతిరేకంగా మంగళవారం, బుధవారం ప్రదర్శనలు కూడా చేపట్టారు.
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు మేరకు, అమ్నెస్టీ ఏర్పాటుచేసిన చర్చా కార్యక్రమంలో దేశ ద్రోహ నినాదాలు జరిగాయా..అనే దానిపై విచారణ చేపట్టామని పోలీసులు చెప్పారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, బెంగళూరు సెమినార్కు హాజరైన కొంతమంది ప్రజలు కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని మాత్రమే కోరుకుంటూ నినాదాలు చేశారని ఆ సంస్థ తెలిపింది. అమ్నెస్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రాతిపదికన లేకుండా కేసును నమోదుచేశారని చారిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ కార్యక్రమం అందరినీ ఆహ్వనించదగినదని, ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. కానీ సంస్థకు చెందిన ఎవరు దీనిలో పాల్గొనలేదని వివరించారు. జమ్ము కశ్మీర్లోని బాధితులకు న్యాయం చేసేందుకే తాము చర్చా కార్యక్రమం నిర్వహించామని అమ్నెస్టీ స్ఫష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను అమ్నెస్టీ పోలీసులకు సమర్పించింది. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్లు దీనిపై విచారణ చేపడతారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
అమ్నెస్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూత
Published Thu, Aug 18 2016 12:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement