పెరుగుతున్న భారతీయుల డ్రగ్స్ కేసులు | 60 pc of Indians in Kuwait jailed over drugs cases | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న భారతీయుల డ్రగ్స్ కేసులు

Jul 24 2015 11:08 AM | Updated on May 25 2018 2:11 PM

మత్తుపదార్థాల అక్రమ రవాణాతో కువైట్ లో జైలు పాలైన భారతీయుల సంఖ్య పెరుగుతోంది.

దుబాయ్: మత్తుపదార్థాల అక్రమ రవాణాతో కువైట్ లో జైలు పాలైన భారతీయుల సంఖ్య పెరుగుతోంది. కువైట్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిలో 60 శాతం మందిపైగా మత్తుపదార్థాల అక్రమ రవాణా కేసులతో సంబంధమున్నవారేనని ప్రభుత్వం గణంకాలు వెల్లడిస్తున్నాయి. డ్రగ్స్ తో పట్టుబడిన వారు తమ న్యాయవ్యవస్థ నుంచి తప్పించుకోలేరని తెలిపింది.

ఇలాంటి కేసుల్లో అరెస్టైన వారి విషయంలో దౌత్య కార్యాలయాలు జోక్యం చేసుకునే వీలుండదని స్పష్టం చేసింది. కువైట్ చట్టాల ప్రకారం మత్తుపదార్థాల రవాణా కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. బెయిల్ కూడా దొరకదు. కువైట్ లో 8 లక్షల మందిపైగా భారతీయులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement