సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి: ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి: ముగ్గురు మృతి

Published Sat, Sep 7 2013 2:26 PM

3 killed in militant attack on CRPF camp in Kashmir

జమ్మూ కాశ్మీర్లోని షాపియన్ జిల్లా, గగ్రన్ సమీపంలోని సీఆర్పీఎఫ్ శిబిరంపై మధ్యాహ్నం తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి చేశారు. భద్రతాదళాలు వెంటనే తేరుకుని ప్రతిగా కాల్పులు జరిపారు. దాంతో ముగ్గురు తీవ్రవాదులు అక్కడికక్కడే మరణించారని ఐజీ ఏ.జీ.మిర్ శనివారం ఇక్కడ వెల్లడించారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. మృతులు ఏ సంస్థకు చెందిన తీవ్రవాదులో ఇంకా తెలియలేదని తెలిపారు.

Advertisement
Advertisement