ఆకలికి తట్టుకోలేక ఓ యువకుడు మరణించాడు. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం వాసి శివుడు (26)ది నిరుపేద కుటుంబం.
కొల్లాపూర్: ఆకలికి తట్టుకోలేక ఓ యువకుడు మరణించాడు. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం వాసి శివుడు (26)ది నిరుపేద కుటుంబం. హైదరాబాద్కు వలస వెళ్లిన అతడి తల్లి కొన్నాళ్ల క్రితం మరణించడంతో భార్యతో కలసి ఇంటికి వచ్చాడు. కూలి పనులు దొరకకపోవడంతో ఆ కుటుంబం పస్తులతోనే గడుపుతోంది. తిండిలేక బాగా నీరసించిన శివుడు బుధవారం మరణించాడు.