ఆక్టోపస్‌ పోలీసుల వీరంగం, ఫిర్యాదు | Youth allegedly Attacked By Octopus Police Team | Sakshi
Sakshi News home page

ఆక్టోపస్‌ పోలీసుల వీరంగం, ఫిర్యాదు

Aug 22 2019 2:51 PM | Updated on Aug 22 2019 3:20 PM

Youth allegedly Attacked By Octopus Police Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :ఆదిభట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆక్టోపస్‌ పోలీసులు మద్యం మత్తులో గతరాత్రి వీరంగం సృష్టించారు. తినేందుకు హోటల్‌కు వచ్చిన కానిస్టేబుల్స్‌.. పక్క టేబుల్‌పై ఉన్న రాము అనే యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. తనను ఎందుకు వేధిస్తున్నారంటూ ఆ యువకుడు ప్రశ్నించగా, తమనే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతాపం చూపించారు. అంతేకాకుండా అడ్డు వచ్చినవారిని కూడా... కానిస్టేబుల్స్‌ చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటివరకూ పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదని రాము ఆరోపిస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement