చైతన్యపురి మారుతీనగర్లో గురువారం ఓ యువతిపై కత్తులతో దుండగులు దాడిచేశారు.
హైదరాబాద్: చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటిరిగా మహిళలు కనిపిస్తే చాలు.. వారిపై దాడిచేసి మహిళల మెడనుంచి అభరణాలు అపహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా చైతన్యపురి మారుతీనగర్లో గురువారం ఓ మహిళపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మహిళ మెడ నుంచి చైన్ స్నాచింగ్కు యత్నించాడు. ఈ క్రమంలో మహిళ ప్రతిఘటించడంతో దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రగాయాల పాలైంది.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.