ఉత్తరాన ఢిల్లీ, జైపూర్, బృందావనం దక్షిణాన రామేశ్వరం, కన్యాకుమారి
ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు 5 శాతం రాయితీ, బీమా కవరేజీ
శీతాకాలం చివర్లో ప్రకృతి అందాలు ఆస్వాదించాలనుందా.. అరుుతే గోల్డెన్ ట్రయూంగిల్ ప్యాకేజీలు మీ కోసమే. ఇండియన్ రైల్వేస్ అండ్ క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వీటిని ప్రకటించింది. ఈ పర్యటనల్లో టికెట్ చార్జీపై ఐదు శాతం రాయితీ, ప్రమాద బీమా కూడా కల్పిస్తోంది.
- సాక్షి, హన్మకొండ
ఉత్తర భారత దేశ యూత్ర ఇలా..
ఉత్తర భారతదేశ గోల్డెన్ ట్రయాంగిల్ ప్యాకేజీ లో ఢిల్లీ, ఆగ్రా, బృందావనం, మధుర, జైపూర్ ఉన్నాయి. ఈ యాత్ర 7 రాత్రులు, 8 పగళ్లుగా ఉంటుంది. డిసెంబర్ 20న ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 గంటలకు బ యల్దేరి కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, ఇటా ర్సీ, భోపాల్ మీదుగా రెండోరోజు తెల్లవారుజామున 4:05 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుతుంది. మూడోరోజు ఢిల్లీలో పర్యాటక ప్రాంతాలైన ఇండియాగేట్, కుతుబ్మీనార్, పార్లమెంట్, రాజ్ఘాట్, అక్షర్ధామ్, లోటస్ టెంపుల్ సందర్శన ఉంటుంది. రాత్రి జైపూర్ ప్రయాణం ఉంటుంది.
నాలుగోరోజు జైపూర్ లో అంబర్ఫోర్ట్, జంతర్మంతర్, హవామహల్, సిటీ ప్యాలెస్ చూపిస్తారు. రాత్రి బస అక్కడే. ఐదో రోజు ఫతేపూర్, సిక్రీల మీదుగా ఆగ్రాలో తాజ్మహల్ సందర్శన ఉంటుంది. ఆరో రోజు మధుర, బృందావనం, ద్వారకాదీశ్లను పర్యటకులు సందర్శించవచ్చు. ఏడో రో జు మధ్యాహ్నం 1:00 గంటకు మధురై రైల్వేస్టే షన్ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏసీ ప్రయాణంలో ఒక్కో వ్యక్తికి రూ.20,755, ఇద్దరికి రూ. 16,892, ముగ్గురికి రూ.15,897లను టికెట్గా నిర్ణయించారు. పిల్లలకు టికెట్ రూ. 10,486.
రామేశ్వరం యాత్ర విశేషాలు
దక్షిణ భారతదేశ గోల్డెన్ ట్రయాంగిల్ టూర్లో భాగంగా రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, నాగర్కోయిల్లో పర్యటించవచ్చు. 2015 జనవరి 28, మార్చి 4 తేదీల్లో ఈ యాత్ర ఉం టుంది. ఈ రెండు రోజుల్లో సాయంత్రం 5:55 గంటలకు కాచిగూడ నుంచి రైలు బయల్దేరి త ర్వాతి రోజు రాత్రి 7:45 గంటలకు రామేశ్వరం చేరుతుంది. మూడోరోజు రామేశ్వరంలోని అగ్నితీర్థం, రామనాథస్వామిగుడి, ధనుష్కోటి బీచ్, పంచముఖి హన్మాన్, రామ్కుంఢ్, పంబర్ వంతెనలను సందర్శిస్తారు. అదేరోజు రాత్రి కన్యాకుమారికి ప్రయాణవుతారు. నాలుగోరోజు కన్యాకుమారిలో సూర్యోదయం సందర్శనతో పర్యటన మొదలవుతుంది. పద్మనాభపురం ప్యాలెస్, వివేకానందరాక్ మెమోరియల్, ఇతర పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఐదోరోజు మధుర మీనాక్షి దర్శనమయ్యూక హైదరాబాద్కు తిరుగు ప్రయాణం. ఈ ప్యాకేజీలో స్లీపర్క్లాస్ ప్రయాణానికి ఒకరికి రూ.10,078, ఇద్దరికి రూ. 8,530, ముగ్గురికి రూ. 8,219. త్రీటైర్ ఏసీకి సంబంధించి ఒకరికి రూ.16,767, ఇద్దరికి రూ.14,626, ముగ్గురికి రూ.12,699లుగా చార్జీ వసూలు చేస్తారు.
దేశాన్ని చుట్టేద్దామా !
Published Wed, Dec 17 2014 3:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement