ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య | women suicide with two children | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

Sep 18 2017 1:32 PM | Updated on Sep 19 2017 4:44 PM

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌ కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

నాగర్‌కర్నూలు: ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్‌ మండలం పాతాలగంగలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని రక్షించడానికి యత్నించినా లాభం లేకపోయింది.
 
అప్పటికే ముగ్గురు నీట మునిగి మృతిచెందారు. కాగా.. మృతురాలు నిన్న రాత్రి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరు కర్ణాటకకు చెందిన వారిగా స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement