భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది.
ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
Jul 8 2017 2:07 PM | Updated on Sep 5 2017 3:34 PM
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లలు సహా తల్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలోని టేకులపల్లి మండలం కోయగూడెంలో శనివారం వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement