ఇంటి పర్మిషన్‌ ఇ‍వ్వలేదని కిరోసిన్‌ పోసుకున్న మహిళ | A Woman Tried To Commit Suicide, Refuse To Give Her Home Permit In Saidapur, Karimnagar | Sakshi
Sakshi News home page

ఇంటి పర్మిషన్‌ ఇ‍వ్వలేదని కిరోసిన్‌ పోసుకున్న మహిళ

Jul 24 2019 11:28 AM | Updated on Jul 24 2019 11:33 AM

A Woman Tried To Commit Suicide, Refuse To Give Her Home Permit In Saidapur, Karimnagar - Sakshi

ఆందోళన చేస్తున్న ఆలేటి రజిత

సైదాపూర్‌(కరీంనగర్‌) : సైదాపూర్‌ మండలం వెన్కెపల్లికి చెందిన ఆలేటి రజితకు పంచాయతీ కార్యదర్శి ఇంటి ఫర్మిషన్‌ ఇవ్వడం లేదని గ్రామపంచాయతీలోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని మంగళవారం ఆందోళనకు దిగింది.వెన్కెపల్లిలో ఆలేటి రాములు–రజిత దంపతులు టైలరింగ్‌ షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి గ్రామపంచాయతీ పర్మిషన్‌ కావాలని గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా పర్మీషన్‌ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీలో కిరోసిన్‌ పోసుకొని తలుపులు వేసుకుంది. స్థానిక పోలీసులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు వచ్చి సంబంధిత ధ్రువపత్రాలతో  దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే పర్మిషన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో తలుపులు తీసి అక్కడ నుంచి రజిత ఇంటికి వెళ్లిపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement