మహిళా రైతు ఆత్మహత్య | Woman farmer commits suicide | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Sep 29 2015 7:25 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక.. ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది.

అప్పుల బాధ తాళలేక.. ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం వడ్డెలింగాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మహిళా రైతు మాలోవత్ సునిత(38) తనకున్న రెండెకరాల భూమితో పాటు గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన మూడున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో రెండేళ్లుగా పంటలు సరిగ్గా పండక అప్పులు ఎక్కువవడంతో.. వాటిని తీర్చేదారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement