ఒక్క మిస్‌డ్‌ కాల్‌.. ఇంటికే పండ్లు | Sakshi
Sakshi News home page

ఫామ్‌ టు హోమ్‌ సేవలు ప్రశంసనీయం

Published Tue, Apr 21 2020 11:23 AM

Walk For Water Home Delivery Service With Missed Call - Sakshi

లక్డీకాపూల్‌ : ఒక్క మిస్‌డ్‌ కాల్‌ ఇస్తే..ఇంటి వద్దకే పండ్లు సరఫరా  చేస్తున్న ‘వాక్‌ ఫర్‌ వాటర్‌ సంస్థ’ ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అభినందించారు. రైతులను ప్రోత్సాహించే దిశగా జరుగుతున్న ఈ ప్రక్రియకు ప్రజలు చేయూత నివ్వాలన్నారు. ప్రజలు  కొనుగోలు చేసే ప్రతి పండు రైతుక అండగా నిలవటంలో భాగమన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చేతికి  వచ్చిన పండ్లు తోటల్లోనే మగ్గిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో  రైతులకు,  వినియోగదారులకు వారధిగా  నిలుస్తున్న ‘వాక్‌ ఫర్‌ వాటర్‌’ వ్యవస్ధాపకులు కరుణాకర్‌ రెడ్డి కృషిని మంత్రి కొనియాడారు.

Advertisement
Advertisement