'దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే క్షమించం'

'దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే క్షమించం' - Sakshi


కరీంనగర్‌ : హిందువుల రక్షణ కోసం వీహెచ్‌పీ కట్టుబడి ఉందని విశ్వ హిందూ పరిషత్‌ నాయకుడు ప్రవీణ్‌ తొగాడియా వ్యాఖ్యానించారు. భారతదేశం హిందురాజ్యమని, ఈ దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవారిని క్షమించేది లేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. దేశంలో ఎక్కడైనా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని ప్రవీణ్‌ తొగాడియా పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top