గాంధీభవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు శనివారం ఘనం జరిగాయి.
హైదరాబాద్ : గాంధీభవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు శనివారం ఘనం జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, భట్టి విక్రమార్క, డీఎస్తోపాటు పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవహారాల్లో స్తబ్దత ఉంటుందన్నారు. అలాగే ప్రతిపక్షాలు స్థిరత్వాన్ని కోల్పోతాయని తెలిపారు. రాజకీయ లోపాలు ఉంటాయని చెప్పారు. అన్ని రంగాల్లోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చిరుకూరి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు.