ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజీనగర్ సమీపంలో టేకు దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టేకు దుంగలు పట్టివేత
Dec 23 2015 10:53 AM | Updated on Sep 3 2017 2:27 PM
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజీనగర్ సమీపంలో టేకు దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం కారులో తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందడంతో అధికారులు సోదాలు జరిపారు. అధికారులను చూసి డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. దీంతో కారుతో పాటు, కలప దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు రిజిస్ర్టేషన్ నెంబరు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement