రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి | Three killed in road accident in nizamabad district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Oct 3 2014 5:11 PM | Updated on Aug 30 2018 3:56 PM

నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అక్బర్నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అక్బర్నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహానాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement