ఖమ్మం జాతీయ రహదారి మరోసారి నెత్తురోడింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర శివారు వద్ద జాతీయ రహదారిపై ...
వరంగల్ : ఖమ్మం జాతీయ రహదారి మరోసారి నెత్తురోడింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర శివారు వద్ద జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని .. వరంగల్ వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకరు మెట్రో రైలు కాంట్రాక్టర్ సోమేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు.