రామన్నపేట: మహా శివరాత్రి సందర్భంగా సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. చెరువులో కారు కడగడానికి వెళ్లిన తండ్రి, కొడుకు, స్నేహితుడు జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో వెలుగుచూసింది. రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామ సర్పంచ్ ధర్నె రాణి భర్త మధు (35) టీఆర్ఎస్ నాయకుడు. వీరికి కుమారుడు మణికంఠ (10), కుమార్తె అభినయ ఉన్నారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా కారును కడిగేందుకు ఉదయం 11 గంటల సమయంలో సర్నేనిగూడెంలోని తన ఇంటి నుంచి స్నేహితుడైన నన్నూరి శ్రీధర్రెడ్డి (25)తో కలిసి వెల్లంకిలోని మరో మిత్రుడి పొలంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు పయనమయ్యారు. పండుగ సందర్భంగా స్కూల్కు సెలవు కావడంతో కుమారుడు మణికంఠ కూడా వస్తానని మారాం చేయడంతో తండ్రి మధు వద్దని వారించాడు. తాత యాదయ్య మధుకి నచ్చజెప్పి మనవడిని తండ్రితో పాటు పంపించాడు.
ఈ క్రమంలో రాణి, ఆమె భర్త మధు, అత్తా మామలు అందరూ కలసి శుక్రవారం సాయంత్రం వెల్లంకిలోని శివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ బావి వద్ద ఉన్న వీరికి గుడికి వెళ్దామని ఇంటి నుంచి ఫోన్ రావడంతో సాయంత్రం 4.30 గంటల సమయంలో బావి వద్ద నుంచి ముగ్గురు కారులో బయలుదేరారు. అయితే కొద్దిసేపటికే వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. గుడికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా వారి ఫోన్లు కలువ లేదు. రాత్రి వరకు ముగ్గురు తిరిగి రాకపోవడం, ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే వారి ఆచూకీ కోసం బంధువులు, స్నేహితులు ఇళ్లతో పాటు వ్యవసాయ పొలాల వద్ద వెతికినా లాభం లేకుండాపోయింది. శనివారం ఉదయం చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, సీఐ ఏవీ రంగా, ఎస్ఐలు సీహెచ్ సాయిలు, శివనాగప్రసాద్ సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు, సెల్ టవర్ల నెట్వర్క్ (సీడీఆర్) ఆధారంగా ఆ ముగ్గురు స్థానిక ఈదుల చెరువు శివారులోనే అదృశ్యమైనట్లు గుర్తించారు.
చెరువులో జల సమాధి..: సీడీఆర్ ఆధారంగా ఫోన్ మాట్లాడిన కొద్దిసేపటికే సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడం, కారు కడిగిన బావికి 500 మీటర్ల దూరంలోనే చెరువు ఉండటంతో పోలీసుల దృష్టి సమీపంలోని ఈదుల చెరువుపై పడింది. అప్పటికే అక్కడికి చేరుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏసీపీ, సీఐతో చర్చించారు. వెల్లంకికి చెందిన యువకుల సాయంతో ఈదుల చెరువులోకి దిగి కారు కోసం వెతికారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరువు ఒడ్డు సమీపంలో కారు మునిగినట్లుగా గుర్తించారు. జేసీబీ సాయంతో కారును వెలికి తీసి అందులో ఉన్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
కారు అదుపు తప్పడంతోనే..: బావి వద్ద నుంచి బయలుదేరిన కారు ఈదుల చెరువుపై నిర్మించిన కట్ట మీదకు రాగానే అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఇది ఎవరూ గమనించకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
తల్లిని ఓదార్చిన కుమార్తె..: భర్త అదృశ్యమై పుట్టెడు దుఃఖంలో ఉన్న మధు భార్య రాణిని ఆమె కుమార్తె అభినయ ఓదార్చిన తీరు కంటతడి పెట్టించింది. వెల్లంకి హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న అభియన.. తల్లి, బంధువులతోపాటు కారు కడిగిన వ్యవసాయ బావి వద్దకు వచ్చింది. తన భర్త, కుమారిడి ఆచూకీ చెప్పా లని కనిపించిన వారినల్లా గుండెలవిసేలా రోదిస్తూ అడుగుతుండటంతో.. నాన్న, తమ్ముడు క్షేమంగా తిరిగి వస్తారని, నువ్వు ఏడవద్దని తల్లిని ఓదార్చిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
సహాయక చర్యల్లో ఎమ్మెల్యే..: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. సర్పంచ్ రాణిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక యువకులతో ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను బయటకు తీసిన అనంతరం పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు.
ముగ్గురు జల సమాధి
Published Sun, Feb 23 2020 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement