రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్య

Oct 3 2015 10:53 AM | Updated on Oct 1 2018 2:44 PM

అప్పుల బాధతో పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అప్పుల బాధతో పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామంలో పిల్లల మర్రి జగన్ (43) అప్పుల భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను శనివారం ఉదయం మరణించాడు.

అయితే రెండేళ్లుగా దిగుబడి సరిగా లేక పోవడంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement