సదాశివనగర్ మండలం కేంద్రంలోని హన్మాన్ టెంపుల్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణ హత్య జరిగింది.
సదాశివనగర్ మండలం కేంద్రంలోని హన్మాన్ టెంపుల్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణ హత్య జరిగింది. శీలం శంకర్(36) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది చంపారు. అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.