నలబై కోట్లు విలువైన వెండి పట్టివేత | Ten Tonnes Silver Seized At Bowenpally | Sakshi
Sakshi News home page

పది టన్నుల వెండి పట్టివేత

Jun 10 2019 10:38 AM | Updated on Jun 10 2019 1:24 PM

Ten Tonnes Silver Seized At Bowenpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిక్రింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో పది టన్నుల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న కంటైనర్‌ సోమవారం పోలీసులకు పట్టుబడింది. వాహనంలోని వెండి విలువ సుమారు రూ.40 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనావేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వెండి తరలింపుపై పోలీసులకు అనుమానం రావడంతో వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంటైనర్‌ను తనిఖీ చేయగా.. దానిలో 9వేలకు పైగా వెండి కడ్డీలను పోలీసులు గుర్తించారు. వెండికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోవడంతో వాహనం డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్నిరాబట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. ఇంత మొత్తంలో వెండి పట్టుబడడంతో దీనికి వెనుకున్న దందాపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement