రాష్ట్రంలో మండుతున్న ఎండలు | Temperatures Rises Across Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Feb 25 2019 4:43 AM | Updated on Feb 25 2019 4:43 AM

Temperatures Rises Across Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మెదక్‌లో ఆదివారం పగటి ఉష్ణోగ్రత ఏకంగా 39 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంలలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డు అయింది. భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో 37 డిగ్రీల చొప్పున నమోదైంది. మరోవైపు ఇంటీరియర్‌ ఒడిశా నుంచి తూర్పు, మధ్య అరేబియా సముద్రం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సహా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement