రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Temperatures Rises Across Telangana - Sakshi

మెదక్‌లో అత్యధికంగా 39 డిగ్రీలు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మెదక్‌లో ఆదివారం పగటి ఉష్ణోగ్రత ఏకంగా 39 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంలలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డు అయింది. భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో 37 డిగ్రీల చొప్పున నమోదైంది. మరోవైపు ఇంటీరియర్‌ ఒడిశా నుంచి తూర్పు, మధ్య అరేబియా సముద్రం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సహా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top