* ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు
* వారంపాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
* హైదరాబాద్లో పలు చోట్ల తేలికపాటి జల్లులు
* స్వైన్ఫ్లూ విజృభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు
* గాంధీలో 28 పాజిటివ్ కేసుల నమోదు
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఆదివారం వాతావరణం చల్లబడింది. ఎండ సెగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వారు పలుచోట్ల చిరుజల్లులతో ఉపశమనం పొందారు. వాతావరణంలో ఏర్పడిన వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా తెలంగాణ నుంచి రాయలసీమ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో రాగల 48 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ద్రోణి ప్రభావం మరో వారం రోజులపాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి తెలిపారు. ఈ వారంరోజులు అధిక ఉష్ణోగ్రతల నుంచి స్వల్ప ఉపశమనం ఉంటుందని, తరువాత గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. గరిష్టంగా 27.7 డిగ్రీలు, కనిష్టంగా 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 66 శాతంగా నమోదైంది.
స్వైన్ఫ్లూ టై: వాతావరణంలో తేమ శాతం బాగా పెర గడం, గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో స్వైన్ఫ్లూ వైరస్ హెచ్1ఎన్1 విజృంభించే అవకాశాలుండడం ఆందోళన కలిగిస్తోంది. ముందుజాగ్రత్తలు తీసుకోకుంటే అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఆదివారం గాంధీ ఆస్పత్రిలో 28 స్వైన్ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని వైద్యులు తెలిపారు. మరో 35 స్వైన్ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
చల్లబడ్డ తెలంగాణ
Published Mon, Mar 2 2015 1:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement