కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాళా: షబ్బీర్ అలీ | telangana state become bankrupt in kcr rule | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాళా: షబ్బీర్ అలీ

Jan 10 2015 8:20 PM | Updated on Aug 15 2018 8:58 PM

విలువైన ప్రభుత్వ భూములను కేసిఆర్‌ సర్కార్‌ అమ్మకానికి పెడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపించింది.

విలువైన ప్రభుత్వ భూములను కేసిఆర్‌ సర్కార్‌ అమ్మకానికి పెడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కన్జర్వేటివ్‌ జోన్‌, గ్రీన్ బెల్టులోని భూముల్లో నిర్మాణాలకు అనుమతులిస్తూ.... జారీ చేసిన 25 జీవోను ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు.

 

విభజనతో తెలంగాణకు పది వేల కోట్లు మిగులు బడ్జెట్‌ దక్కినప్పటికీ.... కేసిర్‌ పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రం దివాళా తీస్తోందని ఎద్దేవా చేశారు. సీఎల్పీ ప్రాంగణంలో మాట్లాడిన షబ్బీర్‌...కేసీఆర్ పాలనా తీరుపై విమర్శలు సంధించారు.

Advertisement
 
Advertisement
Advertisement