‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు గడువు పెంపు

Telangana Inter Advanced Supplementary Fee Extends - Sakshi

మే 2వ తేదీ వరకు చెల్లించే వెసులుబాటు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌ బోర్డు పొడిగించింది. వచ్చే నెల 2వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 29తో ఫీజు గడువు ముగుస్తుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న వినతులను పరిశీలించిన బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తల్లిదండ్రులు సకాలంలో ఫీజు చెల్లించాలని, ఆ మొత్తాన్ని సంబంధిత ప్రిన్సిపాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్‌ చేయాలని స్పష్టం చేసింది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top