శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై | Telangana Governor Tamilisai Soundararajan Visits Tirumala For Worship | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

Oct 24 2019 2:38 AM | Updated on Oct 24 2019 2:38 AM

Telangana Governor Tamilisai Soundararajan Visits Tirumala For Worship - Sakshi

సాక్షి, తిరుమల: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అడిషనల్‌ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలంగాణ గవర్నర్‌కు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, చిత్రపటం అందించి,  ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ గవర్నర్‌ హోదాలో తొలిసారి తిరుమలేశుని ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement