నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామిని తెలంగాణ రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దర్శించుకున్నారు.
యాదగిరీశుడి సేవలో డిప్యూటీ సీఎం
Nov 28 2015 12:59 PM | Updated on Oct 30 2018 7:30 PM
యాదాద్రి: నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామిని తెలంగాణ రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదాద్రి కి వెళ్లిన ఆయనకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయనతో పాటు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కూడా స్వామిని దర్శించుకున్నారు.
Advertisement
Advertisement