తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే గిరిజనులకు మూడు ఎకరాల భూమి పంపిణీపై సీపీఎం, సీపీఐ, పెన్షన్లు, ఆహార భద్రతపై టీడీపీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, ఉద్యోగుల భర్తీపై బీజేపీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. కాగా బడ్జెట్పై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. మరోవైపు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు విపక్షాలు సిద్ధం అయ్యాయి.