కర్ణాటకకు చెందిన ఐరావత్ బస్సు ప్రయాణికులకు చుక్కలు చూపించింది.
ఆగిపోయిన ఐరావత్ బస్సు
Sep 2 2017 11:37 AM | Updated on Sep 12 2017 1:39 AM
- ప్రయాణికుల ఇక్కట్లు
మహబూబ్నగర్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కర్ణాటకకు చెందిన ఐరావత్ బస్సు ప్రయాణికులకు చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్యతో జానంపేట వద్ద బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఎండలోనే నిరీక్షిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో 50 మంది ప్రయాణికులు బెంగళూరు వెళ్తున్నారు.
Advertisement
Advertisement