సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో దేవాలయ, వక్ఫ్, భూదాన బోర్డులకు చెందిన భూముల కేటాయింపులు, వాటి వినియోగంపై ఎప్పటికప్పుడు నివేదికలను అందించడానికి ప్రభుత్వం శుక్రవారం టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. గతంలో నిర్దిష్ట అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను ఏయే అవసరాల కోసం వినియోగిస్తున్నారన్న అంశాన్ని పరిశీలించే ఈ టాస్క్ఫోర్స్కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యాంకుమార్ సిన్హా చైర్మన్గా ఏర్పాటైంది.
భూ కేటాయింపులపై భారీగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం ఈ సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. భూ కేటాయింపుల సందర్భంగా ప్రభుత్వం విధానం, భూ కేటాయింపు అవసరం, మార్గదర్శకాల మేరకు భూమిని వినియోగిస్తున్నారా? చట్టానికి లోబడి ఆ భూ వినియోగం జరుగుతున్నదా? అనే అంశాలపై ఈ టాస్క్ఫోర్స్ లోతుగా అధ్యయనం చేస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ విధానాలు, చట్టానికి లోబడి భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ టాస్క్ఫోర్స్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, సీసీఎల్ఏకు అందిస్తుందని తెలిపింది. ఉత్తర్వుల ప్రకారం ఈ టాస్క్ఫోర్సు విధులు, అధికారాలు, జీతభత్యాలు, సౌకర్యాలు ఇలా ఉన్నాయి..
అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన భూముల కేటాయింపులు, బదిలీ, లీజు తీసుకున్న సంస్థలు ఏయే అవసరాలకు వినియోగిస్తున్నాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి, అనుభవదారులు ఎవరు అనే అంశాలపై నిర్దిష్టమైన రికార్డులతో డేటా బేస్ను రూపొందించాలి.
అన్ని భూ కేటాయింపుల కేసుల్లోనూ అతిక్రమణలు, ఉల్లంఘనలపై నిర్దిష్టమైన, స్పష్టమైన రికార్డులు తయారు చేయాలి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని జాగీర్ భూముల రికార్డులు, క్షేత్రస్థాయిలో కనిపించని భూముల జాబితా రూపొందించాలి.
హైదరాబాద్ పరిసరాల్లోని దేవాలయాల, వక్ఫ్, భూదాన భూముల పరిరక్షణకోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు తయారు చేయాలి.
భూకేటాయింపులపై టాస్క్ఫోర్స్
Published Sat, Dec 6 2014 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement