పెండింగ్లో ఉన్న ఇంటర్మీడియట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ బీసీ సంఘం విద్యార్థులు ధర్నాకు దిగారు.
'పెండింగ్ స్కాలర్షిప్లు చెల్లించండి'
Aug 20 2015 1:41 PM | Updated on Sep 15 2018 4:12 PM
బాన్సువాడ: పెండింగ్లో ఉన్న ఇంటర్మీడియట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ బీసీ సంఘం విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 2014-15 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వం స్కాలర్షిప్లను ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో, కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్లకు విడుదల చేసి సమస్యలను పరిష్కరించాలని బీసీ సంఘం విద్యార్థి నాయకులు కోరారు.
Advertisement


