‘సీమాంధ్ర ఎంపీడీఓలను బదిలీ చేయండి’ | should be transfer seemandhra mpdos | Sakshi
Sakshi News home page

‘సీమాంధ్ర ఎంపీడీఓలను బదిలీ చేయండి’

Sep 13 2014 12:06 AM | Updated on Sep 6 2018 3:01 PM

జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఎంపీడీఓలను వారి సొంత రాష్ట్రానికి పంపించాలని తెలంగాణ ఎంపీడీఓల సంఘం డిమాండ్ చేసింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఎంపీడీఓలను వారి సొంత రాష్ట్రానికి పంపించాలని తెలంగాణ ఎంపీడీఓల సంఘం డిమాండ్ చేసింది.

ఈమేరకు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన టీజీ నేతలు, ఎంపీడీఓ సంఘం ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో టీజీఓ అధ్యక్ష, కార్యదర్శులు మమత, సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి పీసీ వెంకటేశం తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement