పసివాడే పట్టాదారుడు  | Rythu Bandhu Check to the Kids | Sakshi
Sakshi News home page

పసివాడే పట్టాదారుడు 

May 13 2018 1:28 AM | Updated on May 13 2018 1:28 AM

Rythu Bandhu Check to the Kids - Sakshi

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌):  పదేళ్ల వయస్సు లేని బాలుడికి అధికారులు రైతుబంధు పథకం కింద పాస్‌పుస్తకం, పెట్టుబడి సాయం చెక్కు అందించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంతం కవిత, నరేశ్‌ దంపతులకు నిర్మల్‌ (8), నిరంజన్‌(10) అనే కుమారులు ఉన్నారు. వీరి తాత బాల్‌నర్సయ్య తన మనుమల పేరున ఒక్కొక్కరికి ఎకరా 5 గుంటల భూమిని రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించారు.  పట్టాదారుకే సాయం అందించాలన్న నిబంధన మేరకు శనివారం అధికారులు నిర్మల్‌తోపాటు నిరంజన్‌కు పెట్టుబడి సాయం చెక్కులను అందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement