పసివాడే పట్టాదారుడు 

Rythu Bandhu Check to the Kids - Sakshi

బాలుడికి రైతుబంధు చెక్కు

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌):  పదేళ్ల వయస్సు లేని బాలుడికి అధికారులు రైతుబంధు పథకం కింద పాస్‌పుస్తకం, పెట్టుబడి సాయం చెక్కు అందించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంతం కవిత, నరేశ్‌ దంపతులకు నిర్మల్‌ (8), నిరంజన్‌(10) అనే కుమారులు ఉన్నారు. వీరి తాత బాల్‌నర్సయ్య తన మనుమల పేరున ఒక్కొక్కరికి ఎకరా 5 గుంటల భూమిని రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించారు.  పట్టాదారుకే సాయం అందించాలన్న నిబంధన మేరకు శనివారం అధికారులు నిర్మల్‌తోపాటు నిరంజన్‌కు పెట్టుబడి సాయం చెక్కులను అందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top