రాంనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు రూ.82.40 లక్షలు | Rs .82.40 lakh for modernization of drainage system in Ramnagar | Sakshi
Sakshi News home page

రాంనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు రూ.82.40 లక్షలు

May 10 2017 11:48 PM | Updated on Sep 5 2017 10:51 AM

అధికారులతో చర్చిస్తున్న కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి

అధికారులతో చర్చిస్తున్న కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి

రాంనగర్‌ డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు జలమండలి రూ.82.40 లక్షల నిధులు విడుదల చేసిందని కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

విడుదల చేసిన జలమండలి
వెల్లడించిన కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి
అధికారులతో సమీక్షా సమావేశం
సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు


ముషీరాబాద్‌: రాంనగర్‌ డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు జలమండలి రూ.82.40 లక్షల నిధులు విడుదల చేసిందని కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై చిలకలగూడ వాటర్‌వర్క్స్‌ డీజీఎం శ్రీధర్‌రెడ్డి, మేనేజర్‌ హకీం హుస్సేన్, శ్రీనివాస్‌లతో కార్పొరేటర్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్‌లోని 10 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ తీసుకుబోయే చర్యలు, ఖర్చు చేయనున్న నిధుల వివరాలు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement