మురికికాల్వలో బ్యాలెట్‌ పేపర్లు | Ballot Papers Found in Drain During Panchayat Elections in Chinnakaparthi | Sakshi
Sakshi News home page

మురికికాల్వలో బ్యాలెట్‌ పేపర్లు

Dec 13 2025 5:56 AM | Updated on Dec 13 2025 5:56 AM

Ballot Papers Found in Drain During Panchayat Elections in Chinnakaparthi

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో బ్యాలెట్‌ పేపర్‌లు మురికికాల్వలో కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఆవుల సుందరయ్య కాంగ్రెస్‌ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేయగా సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ మద్దతుదారు రుద్రారపు బిక్షంపై 455 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయితే, శుక్రవారం పోలింగ్‌ కేంద్రం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలోని మురికికాల్వలో..  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షం ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్‌ పేపర్‌లను స్థానికులు గుర్తించారు. దీంతో కత్తెర గుర్తు బ్యాలెట్‌లను లెక్కించకుండానే మురికి కాల్వలో వేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. 

అభ్యర్థి రుద్రారపు బిక్షంతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ý ంచర్ల భూపాల్‌రెడ్డిలు చిన్నకాపర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ లభ్యమైన బ్యాలెట్‌ పేపర్‌లను వారు పరిశీలించారు. అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు.

నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి చిట్యాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఎంపీడీఓ, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి జయలక్ష్మితో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. మురికి కాల్వలో లభ్యమైన బ్యాలెట్‌ పేపర్లను ఆర్డీఓ అశోక్‌రెడ్డి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటన లో స్టేజ్‌–2 రిటర్నింగ్‌ అధికారిని సస్పెండ్‌ చేసినట్టు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి చెప్పారు. విచారణ అధికారిగా నల్లగొండ ఆర్డీఓను నియమించామని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement