ఎస్సై చేతిలోని రివాల్వర్ మిస్ఫైర్ అయింది. పట్టణంలోని లాడ్జిలో స్నేహితులతో కలిసి విందు చేసుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో లాడ్జిలో పనిచేస్తున్న సర్వర్బాయ్ కాలికి స్వల్ప గాయమైంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం.. - ఎస్పీ
పట్టణంలోని మయూరి ఇన్ లాడ్జిలో జరిగిన రివాల్వర్ మిస్ఫైర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గజరావు భూపాల్ పేర్కొన్నారు. ఎస్పీ సోమవారం రాత్రి నిర్మల్లోని మయూరి ఇన్ లాడ్జిలో సంఘటన జరిగిన గదిని పరిశీలించారు. అనంతరం ఆయన డీఎస్పీ మాధవరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. లా డ్జిలో రెండు రౌండ్ల కాల్పులు జరిగిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలుతీసుకుంటామని పేర్కొన్నారు.
నిర్మల్ అర్బన్ : కరీంనగర్ జిల్లా రా యికల్ ఎస్సై రాములు నాయక్ ఆది వారం నిర్మల్కు వచ్చారు. అనంతరం తన స్నేహితులైన నిర్మల్ డివిజన్కు చెందిన కొందరు ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఎంఈవోలతో కలిసి కుంటాల జలపాతానికి విహార యాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. అక్కడి నుంచి రాత్రి నిర్మల్లోని మ యూరి ఇన్ లాడ్జి లో 212 నంబర్ గదిలో దిగా రు.రాత్రి స్నేహి తులతో కలిసి విం దు చేసుకున్నారు.
సుమారు 11గంటల సమయంలో రివాల్వర్ కిందపడి పేలింది. ఈ ఘటనలో మద్యం సీసాలు పగిలినట్లు సమాచారం. అదే సమయంలో గదిలోకి సర్వర్ బాయ్ బాలు వచ్చాడని, బుల్లెట్తో దెబ్బతిన్న గచ్చు బాలు కాలికి గుచ్చుకొని స్వల్ప గాయమైందని పోలీసులు తెలిపారు. కాగా, రాయికల్ ఎస్సైరాములు నాయక్ ఉన్న గది.. నిర్మల్ డివిజన్లోని ఓ మండల ఎంపీడీవో పేరిట బుక్ చేసినట్లు లాడ్జి రికార్డుల్లో ఉంది. ఆదివారం మధ్యాహ్నమే ఈ గది బుకింగ్ చేసినట్లు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది.
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. సోమవారం సాయంత్రం డీ ఎస్పీ మాధవ్రెడ్డి లాడ్జిలోని 212 గదిలోకి వెళ్లారు. బుల్లెట్తో దెబ్బతిన్న నేల, గదిని పరిశీలించారు. లాడ్జి నిర్వాహకులు, అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఎస్సై రివాల్వర్ కిందపడడంతోనే మిస్ఫైర్ అయి ఉంటుం దని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ రఘు, పట్టణ ఎస్సై రాంనర్సింహారెడ్డి ఉన్నారు.
ఘటనపై అనుమానాలు..
గదిలో ఉన్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతోనే ఫైర్ జరిగి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. గదిలో సుమారు ఐదుగురు ఉన్న ట్లు సమాచారం. అంతేకాకుండా సర్వ ర్ బాయ్పై ఆగ్రహంతో ఫైర్ చేసి ఉం టారనే అనుమానాలూ వినిపిస్తున్నా యి. అయితే ఎందుకు ఎస్సై రివాల్వర్ నుంచి రెండు బుల్లెట్లు బయటకు వ చ్చాయనే సంగతి ఇంకా తేలాల్సి ఉంది.
పోలీస్ (మిస్) ఫైర్..!
Published Tue, Oct 21 2014 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement