జైల్‌ భరో నిర్వహిస్తాం: రేణుకా చౌదరి | renuka chowdary fires on mirchi yard issue | Sakshi
Sakshi News home page

జైల్‌ భరో నిర్వహిస్తాం: రేణుకా చౌదరి

Jun 6 2017 1:38 PM | Updated on Sep 5 2017 12:57 PM

ఖమ్మం జిల్లా ముదిగొండలో కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా చౌదరి మంగళవారం పర్యటించారు.

ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండలో కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా చౌదరి మంగళవారం పర్యటించారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌పై దాడి ఘటనలో అరెస్టు అయిన చిరుమర్రికి చెందిన రైతు ఆనందరావు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దమ్ముంటే తన చేతికి బేడీలు వేయాలని సవాల్‌ విసిరారు. రైతులపై కండిషన్‌ బెయిల్‌ ఎత్తివేయకపోతే జైల్‌ భరోకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కాగా,  రైతు ఆనందరావును కలిసి రేణుకాచౌదరి రూ.15 వేల సహాయం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement