
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్చాలెంజ్కు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్పందించారు. దీనిలో భాగంగా శనివారం ఆమె మూడు మొక్కలు నాటి హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కృషి చేయాలని కోరారు. అలాగే విరాట్ కోహ్లి, అక్షయ్ కుమార్, సానియా మీర్జాలకు గ్రీన్ చాలెంజ్ చేసి మొక్కలు నాటాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
– బంజారాహిల్స్