పోతారం పంప్‌హౌస్‌ ప్రారంభం

Potharam Pumphouse Started - Sakshi

కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండల పరిధిలోని పోతారం పంప్‌హౌస్‌ను చొప్పదండి ఎమ్మెల్యే  బొడిగే శోభ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోక, నీరులేక మూలకు పడ్డ పోతారం చెరువుకు నీరు ఇవ్వడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పతనమన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు గురించి, ఈ ప్రాంత ప్రజల బాధను సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగానే,, వారు పోతారం పూర్తి చేయాలని అధికారులకు ఆదే«శాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌వారు టీఆర్‌ఎస్‌ చేసే మంచి పనులకు ఎప్పుడూ అడ్డుపడుతున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, సింగిల్‌విండో చైర్మన్‌ పునుగోటి కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్, బొట్ల ప్రసాద్, కుంట కృష్ణవేణి, సమిరిశెట్టి విమల పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top