ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో అంతరాయం | NTPC Fourth unit Crashed at Ramagundam | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో అంతరాయం

May 19 2014 8:56 PM | Updated on Sep 2 2017 7:34 AM

కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల నాలుగో యూనిట్‌లో సోమవారం సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల నాలుగో యూనిట్‌లో సోమవారం సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇప్పటికే ప్లాంట్‌లోని 500 మెగావాట్ల 5వ యూనిట్‌లో వార్షిక మరమ్మతులు కొనసాగుతున్నాయి.

ఈ కారణంగా ఎన్టీపీసీలో 2600 మెగావాట్లకు గాను ప్రస్తుతం 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మంగళవారం వరకు నాలుగో యూనిట్ మరమ్మతులు పూర్తయి ఉత్పత్తి దశలోకి రానున్నట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement