‘కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపడతాం’ | Niranjan Reddy Visits Sarala Sagar Project At Wanaparthy | Sakshi
Sakshi News home page

‘కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపడతాం’

Dec 31 2019 12:39 PM | Updated on Dec 31 2019 12:44 PM

Niranjan Reddy Visits Sarala Sagar Project At Wanaparthy - Sakshi

సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలంలో ఉన్న సారళాసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పెరగడంతో మంగళవారం గండిపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరళాసాగర్‌ కరకట్టకు గండిపడటంపై సాంకేతిక నిపుణులతో విచారణ చేయిస్తామని ఆయన తెలిపారు. కరకట్టకు గండిపడటం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. రబీలో సాగుకు సన్నద్దమైన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 4, 200 ఎకరాలకు నీరందిస్తామని.. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వెంటనే చేపడతామని ఆయన పేర్కొన్నారు.
చదవండి: సరళాసాగర్‌ ప్రాజెక్టుకు భారీ గండి

Advertisement
 
Advertisement
Advertisement