ఆర్టీసీ ఎవరి సొత్తు కాదు: ఎంపీ సంజయ్‌

MP Dharmapuri Aravind Asks To Fulfil RTC Demands - Sakshi

సాక్షి, నిజామాబాద్: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చి.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిజామాబాద్‌ ఎంపీ  ధర్మపురి అరవింద్‌ అన్నారు. గురువారం బోధన్‌లోని ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఆయన.. ఆర్టీసీ ఎవరి సొత్తు కాదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం ఓపికతో వినాలని కోరారు. 

రేపు చలో కరీంనగర్
సమ్మె కార్యాచరణలో భాగంగా శుక్రవారం చలో కరీంనగర్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. కరీంనగర్‌కు కార్మికులంతా తరలిరావాలని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి కోరారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ నంగునూరి బాబు మృతి పట్ల ఆర్టీసీ జేఏసీ సంతాపం ప్రకటించింది. నేడు ఆర్టీసీ డిపోల ఎదుట నిరాహార దీక్షలు చేసిన కార్మికులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top