ఎమ్మెల్యే కారు ఢీ.. వృద్ధుడు మృతి
సాక్షి, మహబూబ్నగర్ : జిల్లాలోని భూత్పూర్ మండలం పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓవ్యక్తి మృతిచెందాడు. నియోజక వర్గంలో పర్యటనకు మంత్రి జూపల్లి కారులో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కొత్తకోటకు వెళ్లారు. దారిలో డీజిల్ అయిపోవడంతో నింపుకొని వెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోతులమడుగు గ్రామానికి చెందిన వెంకటయ్య (59) అక్కడికక్కడే మృతి చెందాడు.