నేడు పీవీ స్మారక ఉపన్యాసం

Memorial Lecture On PV Narasimha Rao Organised By K Ramachandra Murthy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం పీవీ స్మారక ఉపన్యాసం నిర్వహించనున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.37లోని దసపల్లా హోటల్‌లో ఉదయం 11గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ‘సాక్షి’ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి నేతృత్వంలో జరిగే ఈ సభలో ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు శేఖర్‌ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని పీవీ స్మారక ప్రసంగం చేయనున్నారు. జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించనున్న ఈ కార్యక్రమానికి సీనియర్‌ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు హాజరవనున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top