'మన నగరం' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్‌ | 'Mana Nagaram' Program in Quthbullapur  | Sakshi
Sakshi News home page

'మన నగరం' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్‌

Dec 16 2017 12:11 PM | Updated on Sep 4 2018 5:32 PM

 'Mana Nagaram' Program in Quthbullapur  - Sakshi

హైదరాబాద్‌ అభివృద్ది దిశగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 'మన నగరం' కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు.

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అభివృద్ది దిశగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 'మన నగరం' కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. నగరంలోని కుత్భుల్లాపూర్‌లో ప్రారంభించిన 'మన నగరం / ఆప్నా షెహర్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లను 50 కి పెంచుతున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఇకపై ప్రజల వద్దకే అధికారులు వస్తారని.. స్థానికంగా ఉన్న సమస్యలను వారికి చెప్పాలని సూచించారు.

సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు జరుగుతాయని.. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలతో నేరుగా అధికారులు చర్చిస్తారన్నారు. మనం మారుదాం - నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా, మెట్రో రైలును అపరిశుభ్రంగా మారుస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement