* పశుపోషణలో పౌష్టికాహారం, పరిశుభ్రతే ముఖ్యం
* హవేళీఘనపూర్ ఎల్ఎస్ఏ సలావుద్దీన్
పాడి అభివృద్ధిలో.. పశువులు క్రమం తప్పకుండా చూడి కట్టడం అత్యంత ప్రధానమైన అంశమని హవేళీఘనపూర్ వెటర్నరీ లైవ్స్టాక్ అసిస్టెంట్ (ఎల్ఎస్ఏ) సలావుద్దీన్(సెల్: 9908696833) తెలిపారు. సహజంగా 75శాతం పాడి గేదెలు, ఆవులు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య ఎదకు వస్తాయని చెప్పారు. ఈ సమయాన్ని బ్రీడింగ్ సీజన్ అంటారన్నారు. ఈ కాలంలో చూడి కట్టని మూగజీవాలు సక్రమంగా ఎదకు రావ ని స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి లాభం లేకుండా వీటిని ఏడాది పొడవునా పోషించాల్సి ఉంటుందన్నారు. ఇలా కాకుండా రైతులు, పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. - మెదక్ రూరల్
సకాలంలో ఎదను గుర్తించాలి
* పాడి పశువులు చూడి కట్టడం అనేది అవి ఎదకు వచ్చిన సమయాన్ని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది.
* ఎదకు వచ్చిన పశువు అరవడం, తెల్లని తీగలు వేయడం, యోని ఉబ్బడం, మేత సరిగ్గా మేయకపోవటం, పాలు తగ్గటం, నిలకడగా ఉండకపోవడం, అదేపనిగా మూత్రం పోయడం, ఇతర పశువులపైకి ఎక్కడం వంటివి చేస్తుంటాయి.
* వేసవిలో ఎద లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి.
* ముర్రా, బ్రీడెడ్ జాతి గేదెలు ఎదకు వచ్చినా ఎలాంటి లక్షణాలను ప్రదర్శించవు. దీన్ని మూగ ఎద అంటారు.
* ఈ లక్షణాలను వేకువజామున సులభంగా గుర్తించవచ్చు.
* మూగ ఎదను గుర్తించడానికి దున్నపోతును ఉపయోగించవచ్చును.
సరైన పోషణ ఉండాలి
* బ్రీడింగ్ సీజన్లో ప్రతీ పాడి గేదెపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
* తొలకరి వర్షాలకు పెరిగే పచ్చగడ్డి పశువుల్లో పోషక విలువలను గణనీయంగా పెంచుతుంది.
* ఈ సమయంలో ప్రతీ పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి మేతగా వేయాలి.
* ఇందులోని విటమిన్-ఏ పశువు ఎదకు రావడానికి, గర్భం ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
* పచ్చిగడ్డి సరిగ్గా మేయలేని పశువుకు రోజుకు కిలో దాణా వారానికొకసారి విట మిన్ యూనిట్ల ఇంజక్షన్లు ఇప్పించాలి.
* రోజుకు 25నుంచి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి.
* పోషణ సక్రమంగా ఉన్న పశువులు క్రమం తప్పకుండా ఎదకు వస్తాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
* ఎద ఇంజక్షన్ చేయించిన అనంతరం 45 నుంచి 60 రోజుల మధ్య చూడి నిర్ధారణ పరీక్షలు చేయించాలి.
* ఒక్కో గేదె 10 ఈతల వరకు ఈనుతుంది. 7ఈతల తర్వాత పాలఉత్పత్తితగ్గుతుంది.
* చూడి నిర్ధారణ జరిగాక పశువుకు పౌష్టిక ఆహారం అందించాలి.
* పచ్చగడ్డి, ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉండే మేతను పశువుకు వేయాలి.
* సాధారణ రోజుల కంటే చూడి కాలంలో ఒకటినుంచి రెండు కిలోల అదనపు దాణా అందించాలి.
* సరైన పోషణ లేకపోతే చూడికాలం పూర్తవకుండానే దూడ పుట్టే అవకాశాలు ఉన్నాయి.
* ఇలా జరిగిందంటే పుట్టిన దూడ బలహీనంగా ఉండటంతో పాటు వ్యాధి నిరోధ క శక్తిలేక మరణించే ప్రమాదం ఉంటుంది.
చల్లని ప్రదేశంలో కట్టేయాలి
* ఆవులు, గేదెల ఎద కాలం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది.
* పశువు యోని వెంట పచ్చని నీటి లాంటి తీగలు పడుతుంటాయి.
* ఇది గమనించి పశువు వెన్నుపై నిమిరితే తోక కొంచెం పైకిత్తుతుంది.
* ఈ లక్షణాలను గుర్తించి పశువు ఎదకు వచ్చిందని గుర్తించాలి.
* చూడి కట్టించేటప్పుడు పశువును శుభ్రంగా కడగాలి.
* ముఖ్యంగా మానం చుట్టూ పేడ, మట్టి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఎదకు వచ్చిన గేదె, ఆవులను ఆరోగ్యవంతమైన, మేలురకం దున్నపోతు, కోడెతో క్రాస్ చేయించాలి.
* పదేళ్ల వయస్సు దాటిన దున్నపోతులు, కోడెలను చూడి కట్టించేందుకు ఉపయోగించవద్దు.
* ఎదను గుర్తించిన తర్వాత గేదెలు, ఆవులను పశువైద్యశాలకు తీసుకెళ్లి సిమన్ వేయించాలి.
* ఒకేసారి రెండు ఇంజక్షన్లు కాకుండా 5నుంచి 6గంటల వ్యవధిలో రెండు సూదులు వేయించాలి.
* చూడి కట్టించిన రోజున సదరు గేదె, ఆవును బయటకు వదలకూడదు.
* చల్లని, పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో కట్టేయాలి.
* ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో శుభ్రంగా కడగాలి.
చూడితోనే పాడి
Published Thu, Oct 16 2014 2:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement