-
చూడితోనే పాడి
* పశుపోషణలో పౌష్టికాహారం, పరిశుభ్రతే ముఖ్యం * హవేళీఘనపూర్ ఎల్ఎస్ఏ సలావుద్దీన్ పాడి అభివృద్ధిలో.. పశువులు క్రమం తప్పకుండా చూడి కట్టడం అత్యంత ప్రధానమైన అంశమని హవేళీఘనపూర్ వెటర్నరీ లైవ్స్టాక్ అసిస్టెంట్ (ఎల్ఎస్ఏ) సలావుద్దీన్(సెల్: 9908696833) తెలిపారు. సహజంగా 75శాతం పాడి గేదెలు, ఆవులు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య ఎదకు వస్తాయని చెప్పారు. ఈ సమయాన్ని బ్రీడింగ్ సీజన్ అంటారన్నారు. ఈ కాలంలో చూడి కట్టని మూగజీవాలు సక్రమంగా ఎదకు రావ ని స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి లాభం లేకుండా వీటిని ఏడాది పొడవునా పోషించాల్సి ఉంటుందన్నారు. ఇలా కాకుండా రైతులు, పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. - మెదక్ రూరల్ సకాలంలో ఎదను గుర్తించాలి * పాడి పశువులు చూడి కట్టడం అనేది అవి ఎదకు వచ్చిన సమయాన్ని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. * ఎదకు వచ్చిన పశువు అరవడం, తెల్లని తీగలు వేయడం, యోని ఉబ్బడం, మేత సరిగ్గా మేయకపోవటం, పాలు తగ్గటం, నిలకడగా ఉండకపోవడం, అదేపనిగా మూత్రం పోయడం, ఇతర పశువులపైకి ఎక్కడం వంటివి చేస్తుంటాయి. * వేసవిలో ఎద లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. * ముర్రా, బ్రీడెడ్ జాతి గేదెలు ఎదకు వచ్చినా ఎలాంటి లక్షణాలను ప్రదర్శించవు. దీన్ని మూగ ఎద అంటారు. * ఈ లక్షణాలను వేకువజామున సులభంగా గుర్తించవచ్చు. * మూగ ఎదను గుర్తించడానికి దున్నపోతును ఉపయోగించవచ్చును. సరైన పోషణ ఉండాలి * బ్రీడింగ్ సీజన్లో ప్రతీ పాడి గేదెపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. * తొలకరి వర్షాలకు పెరిగే పచ్చగడ్డి పశువుల్లో పోషక విలువలను గణనీయంగా పెంచుతుంది. * ఈ సమయంలో ప్రతీ పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి మేతగా వేయాలి. * ఇందులోని విటమిన్-ఏ పశువు ఎదకు రావడానికి, గర్భం ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. * పచ్చిగడ్డి సరిగ్గా మేయలేని పశువుకు రోజుకు కిలో దాణా వారానికొకసారి విట మిన్ యూనిట్ల ఇంజక్షన్లు ఇప్పించాలి. * రోజుకు 25నుంచి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి. * పోషణ సక్రమంగా ఉన్న పశువులు క్రమం తప్పకుండా ఎదకు వస్తాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి * ఎద ఇంజక్షన్ చేయించిన అనంతరం 45 నుంచి 60 రోజుల మధ్య చూడి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. * ఒక్కో గేదె 10 ఈతల వరకు ఈనుతుంది. 7ఈతల తర్వాత పాలఉత్పత్తితగ్గుతుంది. * చూడి నిర్ధారణ జరిగాక పశువుకు పౌష్టిక ఆహారం అందించాలి. * పచ్చగడ్డి, ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉండే మేతను పశువుకు వేయాలి. * సాధారణ రోజుల కంటే చూడి కాలంలో ఒకటినుంచి రెండు కిలోల అదనపు దాణా అందించాలి. * సరైన పోషణ లేకపోతే చూడికాలం పూర్తవకుండానే దూడ పుట్టే అవకాశాలు ఉన్నాయి. * ఇలా జరిగిందంటే పుట్టిన దూడ బలహీనంగా ఉండటంతో పాటు వ్యాధి నిరోధ క శక్తిలేక మరణించే ప్రమాదం ఉంటుంది. చల్లని ప్రదేశంలో కట్టేయాలి * ఆవులు, గేదెల ఎద కాలం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. * పశువు యోని వెంట పచ్చని నీటి లాంటి తీగలు పడుతుంటాయి. * ఇది గమనించి పశువు వెన్నుపై నిమిరితే తోక కొంచెం పైకిత్తుతుంది. * ఈ లక్షణాలను గుర్తించి పశువు ఎదకు వచ్చిందని గుర్తించాలి. * చూడి కట్టించేటప్పుడు పశువును శుభ్రంగా కడగాలి. * ముఖ్యంగా మానం చుట్టూ పేడ, మట్టి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. * ఎదకు వచ్చిన గేదె, ఆవులను ఆరోగ్యవంతమైన, మేలురకం దున్నపోతు, కోడెతో క్రాస్ చేయించాలి. * పదేళ్ల వయస్సు దాటిన దున్నపోతులు, కోడెలను చూడి కట్టించేందుకు ఉపయోగించవద్దు. * ఎదను గుర్తించిన తర్వాత గేదెలు, ఆవులను పశువైద్యశాలకు తీసుకెళ్లి సిమన్ వేయించాలి. * ఒకేసారి రెండు ఇంజక్షన్లు కాకుండా 5నుంచి 6గంటల వ్యవధిలో రెండు సూదులు వేయించాలి. * చూడి కట్టించిన రోజున సదరు గేదె, ఆవును బయటకు వదలకూడదు. * చల్లని, పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో కట్టేయాలి. * ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో శుభ్రంగా కడగాలి. -
పాడి పశువు ఏటా ఈనాలంటే..
రోజూ 30-40 కిలోల పచ్చి గడ్డి వేయాలి బ్రీడింగ్ సీజన్లో ప్రతి పాడి పశువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తొలకరి వర్షాలకు పెరిగిన పచ్చి గడ్డి పశువుల్లో పోషక విలువలు పెంచుతుంది. ఈ రోజుల్లో ప్రతి పశువుకూ రోజుకు కనీసం 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి వేయాలి. అందులోని విటమిన్-ఏ పశువు ఎదకు రావడానికి, గర్భం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పచ్చిగడ్డి లేని రైతులు ప్రతి పశువుకూ కనీసం కిలో దాణా, వారానికి ఒకసారి నాలుగు వేల ఇంటర్నేషన్ యూనిట్ల విటమిన్ ఇంజక్షన్ ఇప్పించాలి. రోజుకు 25 నుంచి 50 గ్రా. ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి. పోషణ సక్రమంగా ఉన్న పశువులు క్రమంగా ఎదకు వస్తాయి. ఎదను వేకువ జామున గుర్తించవచ్చు పశువు చూడి కట్టించడమనేది ఎదను గుర్తించడం పైనే ఆధారపడి ఉంటుంది. ఎదకు వచ్చినప్పుడు పశువు అరవడం, మానం వెంట తెల్లని తీగలు వేయడం, మానం ఉబ్బి లోపల ఎరుపు రంగులోకి రావడం జరుగుతుంది. అదే పనిగా మూత్రం పోయడం, పశువుల పైకి ఎక్కడం లాంటి పనులు చేస్తుంటాయి. ఇంకా మేత సరిగా తినకపోవడం, పాలు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వేసవిలో గేదేల్లో ఎద లక్షణాలు మరీ తక్కువగా ఉంటాయి. కొన్ని ముర్రా, గ్రేడేడ్ ముర్రా జాతి గేదె ల్లో ఎదకు వచ్చినా ఎలాంటి లక్షణాలు ప్రదర్శించని పరిస్థితి ఉంటుంది. దీనినే మూగ ఎద అంటారు. గేదెలు ఎక్కువగా రాత్రి సమయాల్లో ఎదకు వస్తాయి. ఆ లక్షణాలను వేకువ జామున సులభంగా గుర్తించవచ్చు. పశువుల్లో మూగ ఎదను గుర్తించడానికి టీజర్ ఆంబోతును ఉపయోగించవచ్చు. ఎక్కువ సంఖ్యలో పశువులుంటే టీజర్ ఆంబోతు తప్పని సరిగా ఉండాలి. పశువు ఒకసారి చూడి కట్టకుంటే 18 నుంచి 24 రోజుల మధ్య తప్పనిసరిగా ఎదకు వస్తుంది. సరైన సమయంలో చూడి కట్టించాలి సాధారణంగా ఆవులు, గేదెల్లో ఎదకాలం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ దశలో పశువు మానం వెంట పల్చని నీళ్ల లాంటి తీగలు పడుతుంటాయి. పశువు వెన్ను మీద నిమిరితే తోక కొంచెం పైకి ఎత్తుతుంది. ఈ దశలో తప్పని సరిగా చూడి కట్టించాలి. చూడి కట్టించే సమయంలో పశువును బాగా కడగాలి. ముఖ్యంగా మానం చుట్టూ పేడ, మట్టి లేకుండా చేయాలి. కొంతమంది రైతులు ఒకే సారి రెండు వీర్యదానాలు చేస్తుంటారు. అలా కాకుండా ఆరు గంటల వ్యవధిలో రెండో వీర్యదానం చేయిస్తే కట్టు శాతం పెరుగుతుంది. దున్నపోతులతో కట్టించేటప్పుడు దాని ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. గర్భస్రావాలు కలుగజేసే వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాకే.. వాడటం మేలు. రెండున్నరేళ్ల లోపు.. పదేళ్లు దాటిన దున్నపోతులతో చూడి కట్టించరాదు. ఒకే సారి ఎక్కువ పశువులను దున్నపోతుతో దాటిస్తే చివరి పశువులో చూడి శాతం తగ్గుతుంది. రెండేళ్లకోమారు దున్నపోతును మార్చాలి. చూడి కట్టించాక పశువును ఆ రోజు బయటకు విడవకూడదు. చల్లగా పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో కట్టేయాలి. చల్లని నీటితో గేదేలను కడగాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement