రాష్ట్రంలో పరిశ్రమలకు పెద్దపీట: మంత్రి కేటీఆర్‌ | Land Pooja for Pharmaceuticals Company | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పరిశ్రమలకు పెద్దపీట: మంత్రి కేటీఆర్‌

Jul 1 2018 2:51 AM | Updated on Jul 1 2018 2:51 AM

Land Pooja for Pharmaceuticals Company - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లి జినోమ్‌ వ్యాలీలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఫెరింగ్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీకి శనివారం ఆ సంస్థ సీఈఓ సురేశ్‌ పట్టతిల్‌తో కలసి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు.

జినోమ్‌ వ్యాలీలో అనేక బయోటెక్‌ పరిశ్రమలు ఉన్నాయని, ఫెరింగ్‌ ఫార్మాసూటికల్స్‌ను ఇక్కడ నిర్మించడం అభినందనీయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్, కంపెనీ ప్రతినిధులు లార్స్‌ పీటర్‌ బ్రూన్స్, వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్, ఎంపీపీ చంద్రశేఖర్‌ యాదవ్, సర్పంచ్‌ కిశోర్‌యాదవ్, ఎంపీటీసీ ఎండీ జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement