భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఓకే
- రైతు సమస్యలపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్
- సభ్యుల ఆందోళనతో అట్టుడికిన సభ
- వెల్లోకి ప్రవేశించేందుకు యత్నం.. అడ్డుకున్న మార్షల్స్
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు–మార్షల్స్ మధ్య తోపులాట.. ఉద్రిక్తత
- చర్చ లేకుండానే బిల్లు ఆమోదానికి మహమూద్ అలీ ప్రతిపాదన
- ఆ వెంటనే బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించిన స్పీకర్
- సభ నిరవధిక వాయిదా.. మండలిలో 5 నిమిషాల్లోనే ఆమోదం
- ప్లకార్డులు ప్రదర్శించిన కాంగ్రెస్ సభ్యులు
- బిల్లును ఆమోదించాలని చైర్మన్ను కోరిన మంత్రి హరీశ్
- ఆమోదం పొందినట్లు చైర్మన్ ప్రకటన.. సభ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల మధ్య పట్టుమని పది నిమిషాల్లోనే బిల్లును పాస్ చేసింది. అటు శాసనమండలిలోనూ చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారు. శాసనసభ గతంలో ఆమోదించిన భూసేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు సూచించటంతో ప్రభుత్వం ఆదివారం ప్రత్యేకంగా అసెంబ్లీ, మండలి సమావేశం నిర్వహించింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవగానే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రైతు సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం మొదలైంది.
నల్ల కండువాలు ధరించి హాజరైన కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి మినహా కాంగ్రెస్ సభ్యులందరూ తమ స్థానాల నుంచి లేచి నిలబడి నినాదాలు చేయటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు భూసేకరణ చట్ట సవరణల బిల్లుపై మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ సభ్యులకు పలుమార్లు స్పష్టం చేశారు. తనకు మాట్లాడే అవకాశమివ్వాలని జానారెడ్డి కోరగా... కాంగ్రెస్ సభ్యులంతా ఎవరి స్థానాల్లో వారు వెళ్లి కూర్చుంటే అవకాశం కల్పిస్తామని స్పీకర్ బదులిచ్చారు. అయినా కాంగ్రెస్ సభ్యులు పట్టు వీడకుండా ఆందోళన కొనసాగించారు.
దీంతో సవరణ బిల్లుపై మాట్లాడేందుకు కాంగ్రెస్కు బదులుగా ఎంఐఎం పార్టీకి స్పీకర్ మొదటి అవకాశమిచ్చారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పొడియం వైపు దూసుకు వెళ్లగా మార్షల్స్ అడ్డుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు, మార్షల్స్ మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. బిల్లుపై ఎంఐఎం సభ్యుడు అహ్మద్ పాషా ఖాద్రీ చర్చను ప్రారంభించడంతో కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళనను తీవ్రం చేశారు. ‘రైతులు చనిపోతుంటే ఎక్కడి బిల్... రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు చించి స్పీకర్ పోడియం వైపు విసిరేశారు. ఒకదశలో స్పీకర్ పొడియం ముందు కాంగ్రెస్ సభ్యులు, మార్షల్స్ మధ్య తోపులాట కొనసాగింది. కాంగ్రెస్ సభ్యుడు సంపత్కుమార్ ఆగ్రహంతో మార్షల్స్ను తోసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ ఆయన్ను వెనక్కి నెట్టేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉత్తమ్కుమార్రెడ్డి సైతం మార్షల్స్ను తోసివేసేందుకు ప్రయత్నించారు.
మహిళా కాంగ్రెస్ సభ్యులు డీకే అరుణతోపాటు పద్మావతిరెడ్డి పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మహిళా మార్షల్స్ అడ్డుకున్నారు. ఇదే సమయంలో.. చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రతిపాదించారు. బిల్లులో ప్రతిపాదించిన మూడు సవరణలకు విడివిడిగా స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించారు. అధికార పార్టీ, ఎంఐఎం మద్దతు తెలపడంతో భూసేకరణ చట్ట సవరణల బిల్లును సభ ఆమోదించిందని స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే టీఆర్ఎస్ సభ్యులు బల్లలు చరిచి సంబరాలు చేసుకున్నారు. ఆ మరుక్షణమే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
చర్చలేకుండానే ఆమోదం
Published Mon, May 1 2017 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement